వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమి గొడవ: మైసూరులో పట్టపగలు స్థలం యజమానిని కొడవళ్లతో నరికి చంపిన మహిళలు !

మైసూరు నగరంలో దారుణం జరిగింది. తాను కొనుగోలు చేసిన భూమిలో ఉన్న చెట్లు తొలగించడానికి వెళ్లిన యజమానిని అక్కడే చిన్న షెడ్ లో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు ఈ భూమి మాదే అని గొడవ .

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైసూరు నగరంలో దారుణం జరిగింది. తాను కొనుగోలు చేసిన భూమిలో ఉన్న చెట్లు తొలగించడానికి వెళ్లిన యజమానిని అక్కడే చిన్న షెడ్ లో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలు ఈ భూమి మాదే అని గొడవ పెట్టుకుని కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు.

మైసూరు నగరంలోని బోగాది ప్రాంతంలో లోకేష్ (47) నివాసం ఉంటున్నాడు. ఈయన తన సోదరుడితో కలిసి బోగాది రింగ్ రోడ్డులో 9 గుంటల ఇంటి స్థలం ఇటీవలే కొనుగోలు చేశాడు. 9 గుంటల స్థలం యజమాని ఆ భూమి కబ్జాకాకుండా చూసుకోవడానికి ఓ కుటుంబ సభ్యులకు ఆ స్థలంలో చిన్న షెడ్ కట్టించి చూసుకోమని కొన్ని ఏళ్ల క్రితం చెప్పాడు.

Site matter a man murder at Mysuru city in Karnatak.

ఆ కుటుంబ సభ్యుల్లో శివమ్మ, శోభా అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. కొంత కాలం తరువాత శోభా, శివమ్మ కుటుంబ సభ్యులు ఈ స్థలం మాదే అని యజమాని మీద ఎదురుతిరిగారు. ఆ స్థలం యజమాని గుట్టుచప్పుడు కాకుండా లోకేస్, అతని సోదరుడికి 9 గంటల స్థలం విక్రయించాడు.

సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం లోకేష్ తాము కొనుగోలు చేసిన భూమిలో ఉన్న చెట్లు తొలగించడానికి అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో శివమ్మ, శోభా ఈ భూమి మాదే అంటు లోకేష్ తో గొడవ పెట్టుకున్నారు. మాటామాట పెరగడంతో ముందుగానే వెంట తెచ్చుకున్న కొడవళ్లతో లోకేష్ మీద దాడి చెయ్యడంతో ఆయన సంఘటనా స్థలంలొ మరణించాడని పోలీసులు తెలిపారు.

English summary
Site matter a man murder at Mysuru city in Karnatak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X