అత్యవసర పరిస్థితి కంటే దారుణంగా బీజేపీ వ్యవహరిస్తోంది... దేవేగౌడ
అరవై ఎళ్ల రాజకీయ జీవీతంలో ఇలాంటీ సంఘటనలు చూడలేదని మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవేగౌడ అన్నారు. ముంబాయిలో ఉన్న ఎమ్మెల్యేలను ఉప ముఖ్యమంత్రి శివకుమార్ను కలవనీయ పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కంటే నీచంగా పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ముంబాయి హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడేందుకు తాను బుక్చేసుకున్న గది కూడ వెళ్లనీయకుండా శివకుమార్ అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే ఇలాంటీ సంఘటనలు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని అన్నారు. ఈ సంధర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోనేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరముందని ఆయన కోరారు. మరోవైపు శివకుమార్ చేస్తున్న ప్రయత్నాల్ని పోలీసులు అడ్డుకని ఆయన్ను పోలీసు స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే...
కూటమికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల షాక్
కాగా కూటమి ఓ వైపు రెబల్ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు.కాంగ్రెస్ శాసనసభ సభ్యులు ఎంటీబీ నాగరాజ్, కె. సుధాకర్ బుధవారం తమ రాజీనామా పత్రాలను స్పీకర్కు సమర్పించారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. కాగా సీఎల్పీ సమావేశాన్ని నాగరాజుతోపాటు సుధాకర్ కూడ హజరు కాలేదు. దీంతో వీరు కూడ పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలు అప్పుడే వచ్చాయి.