వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం : షార్ట్ సర్క్యూట్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మౌలానా ఆజాద్ కాలనీలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌ జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను ప్రవీణ్(40),ఫాతిమా(12),సాహిమా(10),రతియా(8),అబ్దుల్ అజీమ్(8),అబ్దుల్ అహద్(5)లుగా గుర్తించారు.ఒక్కసారిగా మంటలు చెలరేగి గది మొత్తం వ్యాపించాయని.. దాంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

six including five children killed in fire caused by short circuit

ఇటీవల ఢిల్లీలోని రాణీ ఝాన్సీ మార్గ్‌లోని అనాజ్ మండీ‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 43 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.గత నవంబర్ నెలలో యూపీలోని గోమతి నగర్ విభూతి ఖండ్ ఫ్లై ఓవర్ కింద ఉన్న మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఫైరింజన్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

English summary
english summary : A fire caused by a short circuit killed six people, five of them children, in a neighbourhood in Loni, Ghaziabad, on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X