వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఫ్యామిలో ఆరుగుర్ని మింగేసిన ఇసుక లారీ

|
Google Oneindia TeluguNews

లుథియానా (పంజాబ్): డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఆరుగురి ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సంఘటన పంజాబ్ లో జరిగింది. నిద్రలోనే ఒకే కుటుంబంలోని ఆరు మంది సజీవ సమాధి అయ్యారని పోలీసులు తెలిపారు.

పంజాబ్ లోని లూథియానా సమీపంలో ఒక భవనం నిర్మాణంలో ఉంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఒక గుడిసెలో రాజు (32), మాన్సీ (30), వీరి పిల్లలు అశు (10), నిహాల్ (5), షీతల్ (3), ఖుషి (1) నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి వీరు భోజనం చేసి నిద్రపోయారు.

Six members of a family Killed as truck overturns in Punjab

అర్దరాత్రి దాటిన తరువాత నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర ఇసుక అన్ లోడ్ చెయ్యడానికి టిప్పర్ లారీ వెళ్లింది. తరువాత డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. టిప్పర్ వాహనం నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరకు కాకుండా పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకు వెళ్లింది.

టిప్పర్ వాహనం దూసుకు వెళ్లడంతో రాజు, మాన్సీ, అశు, షీతల్, ఖుషి, నిహాల్ కు తీవ్రగాయాలైనాయి. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరుగురు కూడా సంఘటనా స్థలంలో మరణించారని వైద్యులు చెప్పారని డిప్యూటి పోలీసు కమిషనర్ హరపాల్ సింగ్ తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Six members of a family, including four children, were buried alive when a truck carrying sand overturned on a hut at a construction site here, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X