యూపీలో పౌర నిరసనలు హింసాత్మకం, 6గురు మృతి
Recommended Video
పౌరసత్వ చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడ అందోళనలు మిన్నంటాయి. ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రారంభమైన ఆందోళనలు ఉత్తారాధితోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అధికార పార్టీకి మద్దతు పలుకుతున్న అలయెన్స్ రాష్ట్రాల్లో కూడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో సీఏఏ పై ప్రజలు భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్రంలో జరిగిన హింసాయుత ఘర్షణలు చెలరేగి ఆరుగురు పౌరులు మృత్యువాత పడగా మరో పదిమంది వరకు గాయాల పాల్పడినట్టు అధికారులు ప్రకటించారు.
పౌరసత్వ చట్టం దేశవ్యాప్త నిరసనలు మిన్నంటాయి. దీంతో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడ నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో మొత్తం 14 రాష్ట్రాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను రద్దు చేసిన పరిస్థితి నెలకొంది. నిరసనలతో పలు చోట్ల హింసాత్మక సంఘటను చెలరేగాయి. అయితే రాష్ట్రంలో చనిపోయిన వారు పోలీసుల కాల్పుల్లో ఒక్కరు కూడ చనిపోలేదని రాష్ట్ర డీజీపీ ఓపి సింగ్ తెలిపారు. వారంతా హింసాత్మక సంఘటనల్లో మృతి చెందారని స్పష్టం చేశారు.
మృతుల్లో బిజునూర్, సాంబల్ ,ఫిరోజాబాద్, మీరట్ మరియు కాన్పూర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కాగా శుక్రవారం రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఈ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. మధ్యహ్నం వేలాదిగా నమాజు చేసేందుకు వచ్చిన ముస్లింలు ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించారని, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ..వీధుల్లోకి వచ్చారని , అనంతరం రాళ్లు రువ్వారని చెప్పారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టు డీజీపీ వివరించారు.