స్కూల్లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిని బల్లకు కట్టేసి.. ఇద్దరు స్వీపర్లు..
రాజస్థాన్లోని ఓ స్కూల్లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. బర్మేర్లోని ప్రభుత్వ పాఠశాలలోఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. చిన్నారిని బల్లకు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
జైపూర్: రాజస్థాన్లోని ఓ స్కూల్లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. చిన్నారిని బల్లకు కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బర్మేర్లో ప్రభుత్వ పాఠశాలలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
రెండో తరగతి చదువుతున్న చిన్నారి ఇంటికి వచ్చి కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యుడు చెప్పిన నిజం విని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.
చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను ప్రశ్నించగా స్కూల్లో జరిగిన విషయం చెప్పింది. దీంతో పాఠశాలలో పనిచేసే ఇద్దరు స్వీపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల గురుగ్రామ్లో ప్రద్యుమ్న, ఢిల్లీలోని స్కూల్లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనలు మరిచిపోకముందే తాజా ఘటన వెలుగు చూడడంతో చిన్నారుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.