యువత కోసం నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు: మోడీ ఏం చేశారు, ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రస్తుతం ఉన్న ఇనిస్టిట్యూషన్స్ను స్కిల్ స్పేస్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది నేషనల్ కౌన్సెల్ ఫర్ వొకేషనల్ ట్రెయినింగ్ (ఎన్సీవీటీ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్ఎస్డీఏ)లను నేషనల్ కౌన్సెల్ ఫర్ వొకేషనల్ ఎడ్యూకేషన్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీవీఈటీ)లో విలీనం చేసింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మధ్యతరగతి వారికి ప్రయోజనాలు
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూయర్షిప్లో ఇది పెద్ద అడుగు. ఇందులో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల ఎంతో ప్రయోజనం చేకూరింది.
స్కిల్ ఇండియా మిషన్ కారణంగా భారత దేశంలో మధ్యతరగతి కుటుంబాలకు లాభం జరుగుతోంది. ఇది ఎక్కువ వర్క్ ఫోర్స్ను అందిస్తోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల యువత ఉద్యోగాలు పొందడంతో పాటు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటోంది.