కొత్త రూల్: రైలులో ఎక్కువ సేపు పడుకోవడం కుదరదు
న్యూఢిల్లీ: రైల్వేశాఖ కొత్త రూల్ను అమల్లోకి తెచ్చింది. రైళ్ళలో చిల్లర జగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది. బెర్తుల్లో నిద్రపోయే వేళలను కుదించింది.
రిజర్వుడ్ బోగీల్లో క్రింది, మధ్య బెర్త్ల ప్రయాణికులు త్వరగా పడుకోవడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటోందని, ఈ విధంగా ఎక్కువసేపు నిద్ర పోవడాన్ని నిరోధించాలని నిర్ణయించింది.
రైల్వే బోర్డు గత నెల 31న విడుదల చేసిన ఓ సర్క్యులర్ ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మాత్రమే బెర్తుల్లో పడుకోవచ్చురాత్రి 10 గంటల కన్నా ముందు, ఉదయం ఆరు గంటల తర్వాత సీట్లలో ఇతరులు కూర్చోవడానికి అవకాశం ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే
గర్భిణులు,
అనారోగ్యవంతులు,
దివ్యాంగులు
ఈ
వేళల
కన్నా
ఎక్కువ
సేపు
నిద్రపోవాలనుకుంటే,
వారికి
ఇతర
ప్రయాణికులు
సహకరించాలని
పేర్కొన్నారు.
ప్రస్తుత
నిబంధనల
ప్రకారం
క్రింది,
మధ్య
బెర్తుల్లో
ప్రయాణికులు
రాత్రి
9
గంటల
నుంచి
ఉదయం
6
గంటల
వరకు
ప్రయాణికులు
నిద్రపోయేందుకు
అనుమతి
ఉంది.
అయితే ఈ నిర్ణయం అమల్లో రైళ్ళలో ఏ రకమైన పరిస్థితి ఉంటుందోననే ఆందోళన కూడ లేకపోలేదు.