తమిళనాడు గవర్నర్గా ఎస్ఎం కృష్ణ? కారణాలివేనా...
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తమిళనాడు గవర్నర్గా నియమితులు కానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీలో చేరనున్నారు.
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తమిళనాడు గవర్నర్గా నియమితులు కానున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం బీజేపీలో చేరనున్నారు.
ఆయన గత జనవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వొక్కలింగ వర్గానికి చెందిన నాయకుడు. ఎస్ఎం కృష్ణ చేరికతో ఆ ఓట్లపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మణిపూర్, గోవాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ ఉత్సాహంలో బీజేపీ తన తదుపరి టార్గెట్గా కర్నాటకను కూడా ఎంచుకుంది.

వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో గెలుపొందాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఎం కృష్ణను తమ వైపుకు రప్పించుకుంది. ఆయనను తమిళనాడు గవర్నర్గా పంపించే అవకాశాలున్నాయని అంటున్నారు.
దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. ఆయన బీజేపీలో చేరిన ఒకటి రెండు రోజుల్లో తమిళనాడు గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దక్షిణాదిన తమిళనాడు చాలా ముఖ్య రాష్ట్రం. జయలలిత మృతి తర్వాత ఆ రాష్ట్రంలోనూ పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
గత కొంతకాలంగా తమిళనాడుకు గవర్నర్ లేరు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎం కృష్ణతో పాటు ఆనందీబెన్ పటేల్ కూడా గవర్నర్ రేసులో ఉన్నారని తెలుస్తోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications