షాక్: పీపీఎఫ్, కేవీపీ వడ్డీరేట్లపై కోత విధించిన కేంద్రం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ,నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస్ పత్రాల వడ్డీరేట్లను కేంద్రం తగ్గించింది.మూడు నెలలకు ఓ సారి మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీరేట్లను సమీక్షించనుంది కేంద్రం.
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ స్కీం, కిసాన్ వికాస పత్ర వడ్డీరేట్లపై మరోసారి ప్రభుత్వం కోత పెట్టింది. పీపీఎఫ్, కేవీపీ, సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం, సుకన్యా సమృద్ధి యోజన సహ పలు చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై 10 బేసిస్ పాయింట్లను తగ్గించినట్టు కేంద్రం ప్రకటించింది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం, సకన్యా సమృద్ది యోజన సహ పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. తాజా నిర్ణయం ప్రకారంగా పీపీఎఫ్, ఎన్ఎస్ సీ పథకాలపై 7.8 శాతం, కేవీపీ పై 7.5 శాతంగా ఉండనుంది, సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం, సుకన్య సమృద్ది పథకాలపై 8.3 శాతం వడ్డీరేట్లు వర్తించనుంది. ఇప్పటివరకు ఇది 8.4 శాతంగా ఉంది.
మూడు నెలలకోసారి మార్కెట్ రేటకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఈ వడ్డీరేట్లకు ప్రాతిపదికగా అంతకు ముందు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకొంటారు.
ఆర్థికాభివృద్దికి దోహదపడేలా వ్యవస్థను తక్కువస్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్నా కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకొంది. గత మార్చి నెల సమీక్షంలో కూడ 10 బేసిస్ పాయింట్లను తగ్గించింది కేంద్రం.