కేంద్రమంత్రినే ఫిదా చేసింది: పాపులర్ సింగర్ కూతురితో గారాలు పోయిన స్మృతి..
అద్నాన్ సమీ కుమార్తె మెదీనాతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారాలు పోయింది.బోసినవ్వుల చిన్నారిని చూసి తల్లి లాగే మురిసిపోయింది.సోమవారం అద్నాన్ సమి తన భార్య, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిన
ముంబై: బోసినవ్వులతో చూడగానే ముద్దొచ్చే చిన్నారులంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. వాళ్లను ఆడిస్తూ.. లాలిస్తూ.. అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అంతలా మాయ చేస్తారు పిల్లలు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కూడా ఓ చిన్నారి మాయ చేసింది.
ఆప్యాయంగా ఆ చిన్నారిని ఎత్తుకున్న స్మృతి.. తల్లి లాగే తెగ సంబరపడిపోయింది. బోసినవ్వులతో ఆ చిన్నారి నవ్వుతుంటే.. తను కూడా మురిసిపోయింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరనుకుంటున్నారా?.. ఇంకెవరు.. పాపులర్ సింగర్ అద్నాన్సమి గారాల పట్టి మెదీనా.
A picture speaks a 1000 words & here its all about 'Love'! Indeed it was 'love at 1st sight' between @smritiirani ji & Medina. Thank You!🙏💖😊 pic.twitter.com/PIUbdMSVCe
— Adnan Sami (@AdnanSamiLive) September 18, 2017
సోమవారం అద్నాన్ సమి తన భార్య, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెదీనాతో స్మృతి చాలాసేపు గడిపింది. చిన్నారిని ఆడిస్తూ గారాలు పోయింది. ఈ చిత్రాలను అద్నాన్ సమి తన కెమెరాలో బంధించారు.
ఆపై తన సోషల్ మీడియా ఖాతాలో వీటిని పోస్టు చేసి.. 'ఓ చక్కటి చిత్రం వెయ్యి భావాలను పలుకుతుంది. ఇరానీజీ, మెదీనా మధ్య లవ్ ఎట్ ఫస్ట్ సైట్కు ఇది నిదర్శనం. కృతజ్ఞతలు..' అంటూ అద్నాన్ సమి పేర్కొన్నారు. నెటిజెన్స్ అంతా ఈ ఫోటోలను ముచ్చటపడి చూస్తున్నారు.
కాగా, మొన్నీమధ్యే అద్నాన్ సమి తన భార్య, కుమార్తెతో కలిసి మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మెదీనా బుగ్గ పట్టుకుని మోడీ ముద్దాడిన ఫోటో నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది.