వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రినే ఫిదా చేసింది: పాపులర్ సింగర్ కూతురితో గారాలు పోయిన స్మృతి..

అద్నాన్ సమీ కుమార్తె మెదీనాతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గారాలు పోయింది.బోసినవ్వుల చిన్నారిని చూసి తల్లి లాగే మురిసిపోయింది.సోమవారం అద్నాన్‌ సమి తన భార్య, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిన

|
Google Oneindia TeluguNews

ముంబై: బోసినవ్వులతో చూడగానే ముద్దొచ్చే చిన్నారులంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. వాళ్లను ఆడిస్తూ.. లాలిస్తూ.. అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అంతలా మాయ చేస్తారు పిల్లలు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కూడా ఓ చిన్నారి మాయ చేసింది.

ఆప్యాయంగా ఆ చిన్నారిని ఎత్తుకున్న స్మృతి.. తల్లి లాగే తెగ సంబరపడిపోయింది. బోసినవ్వులతో ఆ చిన్నారి నవ్వుతుంటే.. తను కూడా మురిసిపోయింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరనుకుంటున్నారా?.. ఇంకెవరు.. పాపులర్ సింగర్ అద్నాన్‌సమి గారాల పట్టి మెదీనా.

సోమవారం అద్నాన్‌ సమి తన భార్య, కుమార్తె మెదీనాతో కలిసి కేంద్రమంత్రి స్మృతిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెదీనాతో స్మృతి చాలాసేపు గడిపింది. చిన్నారిని ఆడిస్తూ గారాలు పోయింది. ఈ చిత్రాలను అద్నాన్ సమి తన కెమెరాలో బంధించారు.

ఆపై తన సోషల్ మీడియా ఖాతాలో వీటిని పోస్టు చేసి.. 'ఓ చక్కటి చిత్రం వెయ్యి భావాలను పలుకుతుంది. ఇరానీజీ, మెదీనా మధ్య లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌‌కు ఇది నిదర్శనం. కృతజ్ఞతలు..' అంటూ అద్నాన్ సమి పేర్కొన్నారు. నెటిజెన్స్ అంతా ఈ ఫోటోలను ముచ్చటపడి చూస్తున్నారు.

కాగా, మొన్నీమధ్యే అద్నాన్ సమి తన భార్య, కుమార్తెతో కలిసి మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మెదీనా బుగ్గ పట్టుకుని మోడీ ముద్దాడిన ఫోటో నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

English summary
Adnan Sami’s daughter Medina is one of the most popular celebrity kids on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X