స్మృతి ఇరాని గెలిచింది అందుకే ...ఆశా భోస్లే
మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ట్రాఫిక్లో ఇంటికి వెళ్లడానికి ఇబ్బందిపడ్డ సింగర్ ఆశాబోస్లేకు కేంద్రమంత్రివర్గంలో మరోసారి స్థానాన్ని దక్కించుకున్న స్మృతి ఇరాని దగ్గరుండి సహాయం చేశారు. ఆశా బోస్లే ఇంటికి వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి మరి చూసుకున్నారు దీంతో ఇతరులకు సహయం చేసే గుణం ఉండడంతోనే ఆమే గెలుపు సాధ్యమయిందన్న విషయాన్ని ఆశాబోస్లే తన ట్విట్టర్లో పేర్కోన్నారు.
అతిపెద్ద మెజారీటితో బీజేపీ గెలిచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే..సాధరణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలను రాష్ట్ర్రపతి భవన్ లోపల నిర్వహిస్తారు. కాని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఓడించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజలు అతిపెద్ద మెజారిటి ఇచ్చారు. దీంతో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశ,విదేశాల నాయకులతోపాటు మొత్తం 8వేల మంది హజరయ్యారు. దీంతో ప్రమాణ స్వీకారం తర్వాత అంతా వీవీఐపీలు కావడంతో భారీ బందోబస్తు చేపట్టారు.
అయితే మోడీ ప్రమాణ స్వీకారానికి హజరైన సింగర్ ఆశాబోంస్లే ప్రమాణ స్వీకారం అనంతరం బయటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డనని తెలిపింది. ఈ విషయాన్ని గమనించిన మంత్రి స్మృతి ఇరాని ఆశాబోంస్లేకు దగ్గరకు వెళ్లి బయటకు వెళ్లేందుకు సహకరించారని పేర్కోంది. ఆమే వల్లే తాను ఇంటి సేఫ్గా చేరానని తెలిపింది. కాగా ఆమేకు సహయం చేసే మనస్తత్వం ఉండడంతోనే ఎంపీగా గెలవగల్గిందని ఆశా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.కాగా ఆశకు ధన్యవాదాలు తెలిపుతూ రీట్వీట్ చేశారు స్మృతి ఇరాని.
I was stranded in the crazy rush post PM oath ceremony. No one offered to help me except @smritiirani who saw my plight & made sure I reached home safely. She cares & that’s why she won. pic.twitter.com/vDV84PrIVp
— ashabhosle (@ashabhosle) May 30, 2019