14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకున్న స్మృతి
55వేలకు పైగా ఓట్ల మెజారీటితో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన పార్లమెంట్లోకి అడుగు పెట్టిన అమేఠీ ఎంపీ స్మృతి ఇరాని ముంబయిలోని సిద్దివినాయక అలయానికి వెళ్లి తన మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఆమే 14 కిలోమీటర్ల మేర కాళ్లకు చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్లారని సిని నిర్మాత ఎక్తా కపూర్ తెలిపారు.
ఎన్నికల్లో గెలుపోందిన నేపథ్యంలో స్మృతి ఇరాని ముంబాయిలోని సిద్దివినాయక అలయానికి తన మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారు. అయితే మంగళవారం ఉదయమే ఆమే స్నేహితురాలు, ఫిలిం ప్రోడ్యుసర్ అయిన ఎక్తా కపూర్తోపాటు ఎక్తకపూర్ కొడుకు కలిసి కాలినడకన 14 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. అయితే చెప్పులు లేకుండానే 14 కిలోమీటర్లమేర నడుచుకుంటూ మంగళవారం ఉదయం వెళ్లారని ఎక్తాకపూర్ తన ఇనస్టాగ్రామ్లో ఓ వీడీయోను పోస్ట్ చేశారు. దీంతో దేవుడి కోరుకుంటే ఎదైన సాధ్యమే అని ఆమే పేర్కోన్నారు.
అమేఠీలో 2014లో రాహుల్ గాంధీపై పోటి చేసిన స్మృతి ఇరాని లక్ష ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం నియోజవర్గంలోనే అమే మకాం వేసి రాహుల్ను ఓడించింది. రాహుల్ గాంధీ అమేఠీని పట్టించుకోకపోవడంతోపాటు పలు విమర్శలను ఆమే సంధించింది.తాజగా అమేఠీలో ఓ కార్యకర్త చనిపోయిన నేపథ్యలంలో అంత్యక్రియల్లో పాల్గోన్న స్మృతి కార్యకర్త ప్యాడ కూడ మోసిన విషయం తెలిసిందే.