ఎస్ఎన్సీ-లావలీన్ కేసు : విజయన్కు ఊరట, ఆధారాల్లేవన్న కోర్టు
ఎస్ఎన్సీ-లావలీన్ అవినీతి కేసులో కేరళ సీఎం విజయన్పై ఆధారాల్లేవన్న హైకోర్టువిజయన్ పేరునే ఎందుకు చేర్చారని ప్రశ్నించిన కోర్టు.ఎస్ఎన్సీ-లావలీన్ కేసులో విజయన్కు విముక్తి
తిరువనంతపురం: అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు హైకోర్టులో ఊరట లభించింది.1995 నాటి ఎస్ఎన్సీ-లావలీన్ అవినీతి కేసులో విజయన్కు విముక్తి లభించింది.
ఈ కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని పలువురు విద్యుత్ మంత్రులు ఎస్ఎన్సీ-లావలీన్తో సంప్రదింపులు సాగించారు.
కానీ, సిబిఐ మాత్రం విజయన్ ఒక్కడినే నిందితుడిగా చేర్చిన అంశాన్ని కోర్టు ప్రస్తావించింది.2013 నవంబర్ 5న, విజయన్తో పాటు ఆరుగురిని సిబిఐ కోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది. వీరికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించడంలో సిబిఐ విఫలం కావడంతో న్యాయస్థానం వీరికి విముక్తి ప్రసాదించింది.
దీంతో సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన విజయన్ రూ.374 కోట్లతో మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులుచేపట్టినప్పుడు కెనడా కంపెనీ ఎస్ఎన్సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై సిబిఐ అభియోగాలు మోపింది.