ఓటువేసిన అన్నా హజారే, హీరాబెన్ ! 98 ఏళ్ల వయస్సులో..
ముంబై/అహ్మదాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్ పాల్ బిల్లు ఉద్యమకర్త అన్నా హజారే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఓటు వేయడానికి అరగంటకు పైగా క్యూలో నిల్చున్న ముఖ్యమంత్రి
అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సరళి పట్ల స్పందించడానికి నిరాకరించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానాన్ని దాటవేశారు. ప్రస్తుతం తాను రాజకీయాలేవీ మాట్లాడట్లేదని చెప్పారు.
98 ఏళ్ల వయస్సులో..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్ లో ఓటు వేశారు. 98 ఏళ్ల వయస్సులో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అహ్మదాబాద్ లోని రైసన్ ప్రాంతంలో ఆమె ఓటు వేశారు.
ఈ సందర్భంగా హీరాబెన్ వెంట.. ఆమె బంధువులు, భద్రతాధికారులు ఉన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన వెంటనే.. అక్కడి సిబ్బంది హీరాబెన్ కు చప్పట్ల కొడుతూ స్వాగతం పలికారు. అంతకుముందు- ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ను కలిశారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.