సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు: సీబీఐ ప్రత్యేక కోర్టులో తుది వాదనలు ప్రారంభం
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో సీబీఐ న్యాయస్థానంలో సోమవారం (డిసెంబర్ 2) వాదనలు తుది వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో తీర్పు డిసెంబర్ నెలాఖరులోగా వస్తుందని భావిస్తున్నారు.
తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన సోహ్రబుద్దీన్ను ఎన్కౌంటర్ చేసిన కేసులో ప్రధాన నిందితులుగా పలువురు అధికారులు ఉన్నారు.
వాంటెండ్ క్రిమినల్ సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్బీ, వారి అనుచరులు తులసిరామ్ ప్రజాపతిలు గుజరాత్లో ఎన్కౌంటర్కు గురయ్యారు. ఈ సంఘటన 2005-2006 సంవత్సరాలలో జరిగింది.
2005లో సోహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ హైదరాబాద్ నుంచి సంగ్లీకి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. వారిని గుజరాత్, రాజస్థాన్ పోలీసులు అడ్డగించి, వారిని ఎత్తుకెళ్లారని, గాంధీనగర్ పరిసరాల్లో ఎన్కౌంటర్ చేశారని చెబుతారు. ఈ హత్యకు తులసీరామ్ ప్రజాప్రతి సాక్షి. అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2006 డిసెంబర్లో అతను కూడా మరో ఎన్కౌంటర్లో చనిపోయాడు.