వెళ్లిపోతున్న మళ్లి వస్తా... పోలీసులను హెచ్చరించిన ప్రియాంక ...
యూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక గాంధీ ఎట్టకేలకు సోనభద్ర బాధిత కుటుంభాలను పరామర్శించారు. అనంతరం నిరసన చేపట్టిన గెస్ట్ హౌజ్ నుండి వెళ్లిపోయారు. భాదిత కుటుంభాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంభానికి పది లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. సోనభద్ర ఘటనలో భాదితులను పరామర్శించేందుకు వెళుతున్న యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అయినా ప్రియాంక గాంధీన వెళ్లడంతో స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమే నిరసన చేపట్టారు. దీంతో బాధితులే ప్రియాంక గాంధి వద్దకు చేరుకున్నారు.
రెండు రోజుల పాటు కొనసాగిన హైడ్రామా
శుక్రవారం నుండి యూపిలోని సోనభద్రలో కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. కాల్పుల్లో మృత్యువాత పడిన కుటుంభాలను పరామర్శించేందుకు సోనభద్రకు చేరిన ప్రియాంక గాంధిని పోలీసులు అడ్డుకున్నారు. సోనభద్ర ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో ,రాజకీయ పార్టీల నాయలను, ఇతర ప్రైవేట్ ఆర్గనైజన్స్ ఎవ్వరిని కూడ అనుతించడం లేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీని సైతం అడ్డుకున్నారు. దీంతో ఆమే చునార్ అతిధి గృహం వద్దే ధర్నాను కొనసాగించింది.
భాదత కుటుంభాలే ప్రియాంక వద్దకు
ఇక అంతకుముందే ప్రియాంక గాంధీని కలుసుకునేందకు వచ్చిన బాధిత కుటుంభ సభ్యులను కూడ పోలీసులు అనుమతించలేదు.దీంతో ప్రియాంకా గాంధీ నేరుగా బయటకు వచ్చి బాధితులను పరామర్శించారు. ఈనేపథ్యంలోనే వారిని ప్రత్యక్షంగా కలుసుకునే వరకు అక్కడి నుండి కదిలేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈనేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నాయకులు సైతం ప్రియాంకకు మద్దతు ఇచ్చేందుకు యూపీ బయలు దేరారు. అయితే వారిని కూడ పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకోవడంతోనే తృణముల్ ఎంపీలు ఎయిర్ పోర్టులోనే నిరసన తెలిపారు.
వెళ్లిపోతున్న తిరిగి మళ్లి వస్తా...
ఈ నేపథ్యంలోనే ఆమే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంభాలకు అండగా ఉంటుందని ఆమే ప్రకటించారు. అనంతరం స్థానిక పోలీసులపై విరుచుకపడ్డారు. శుక్రవారం నుండి బాధితులను పరామర్శించకుండా అడ్డుకున్న పోలీసులే ప్రస్థుతం ఎలాంటీ అరెస్ట్ చేయాలేదని అంటున్నారని మండిపడ్డారు. ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో వెళ్లిపోతున్న నేను తిరిగి వస్తానంటూ పోలీసులను హెచ్చరించారు.