లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ(89) కన్నుమూత: పేదల గొంతుక అంటూ మోడీ సంతాపం
కోల్కతా: లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీ(89) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం గుండెపోటు రావడం పరిస్థితి విషమంగా మారింది. దీంతో సోమవారం ఉదయం ఆయన మృతి చెందారు. సోమ్నాథ్ ఛటర్జీ 10సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1968లో సీపీఎంలో చేరారు చటర్జీ.
2004 నుంచి 2009 మధ్య లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. కాగా, యన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Former MP and Speaker Shri Somnath Chatterjee was a stalwart of Indian politics. He made our Parliamentary democracy richer and was a strong voice for the well-being of the poor and vulnerable. Anguished by his demise. My thoughts are with his family and supporters.
— Narendra Modi (@narendramodi) August 13, 2018
ప్రధాని నరేంద్ర మోడీ.. సోమ్నాథ్ ఛటర్జీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రటించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని ప్రధాని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛటర్జీ మృతి పట్ల తీవ్ర సాంతాపం వ్యక్తం చేశారు.