వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: టెర్ర‌స్‌పై నుంచి తోసేసి తల్లిని క‌డ‌తేర్చిన ప్రొఫెస‌ర్‌, సీసీటీవీ ఫుటేజీతో..

|
Google Oneindia TeluguNews

Recommended Video

టెర్ర‌స్‌పై నుంచి తోసేసి తల్లిని చంపిన ఘనుడు, వీడియో

గాంధీనగర్: నవమాసాలు మోసి, కనీ పెంచి కొడుకుని ప్రయోజకుడిని చేసింది ఆ తల్లి. కానీ, ఆ కొడుకు మాత్రం వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఎండలో కూర్చోబెడతానంటూ తీసుకెళ్లి భవనంపై నుంచి తోసేశాడు. మొదట అందర్నీ ఆత్మహత్యగా నమ్మించినా.. సీసీఫుటేజీతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో సందీప్ అనే ప్రొఫెసర్ నివాసం ఉంటున్నాడు. అతడి తల్లి జై శ్రీబెన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. మూడు నెల‌ల క్రితం ఆమె అపార్ట్‌మెంట్‌పై నుంచి ప‌డి మృతి చెందింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంద‌ని భావించిన పోలీసులు ఈ కేసును మూసేశారు.

 Son killed Mother in Rajkot

అయితే, ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఓ లేఖ రాసి, సీసీటీవీ ఫుటేజీని కూడా అందించాడు. కాగా, గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు పంపించిన సీడీలో.. సందీప్ అపార్ట‌మెంట్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి నమోదైన దృశ్యాలున్నాయి. దీంతో ఈ కేసులో మ‌ళ్లీ ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సందీప్‌ను అరెస్టు చేశారు.

పోలీసుల‌ విచార‌ణ‌లో మొద‌ట అస‌త్యాలు చెప్పిన‌ సందీప్ ఆ త‌రువాత నిజాన్ని ఒప్పుకున్నాడు. తన తల్లికి ఆరోగ్యం బాగో లేక‌పోవ‌డంతో ఆమెను ఆస్పత్రుల చుట్టూ తిప్ప‌లేక‌ విసిగిపోయాన‌ని, అందుకే భవనంపై నుంచి తోసేసి హ‌త్య చేశాన‌ని తెలిపాడు.

English summary
Son killed Mother in Rajkot: Citizens in anger over Professor Son's cruelty for his Mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X