వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్ లో హెచ్ జీ గేమ్స్, రీచార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని ముక్కలుగా నరికేశాడు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మొబైల్ లో హెచ్ జీ(HG)గేమ్స్ ఆడకూడదని బుద్దిమాటలు చెప్పిన కన్న తండ్రిని కొడుకు మూడు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశాడు. తండ్రి శంకరప్ప (59)ను హత్య చేసిన కొడుకు తరువాత మొబైల్ లో కరెన్సీ రీచార్జ్ చేసుకుని చక్కగా గేమ్స్ ఆడుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది.

మాజీ ప్రధాని మనుమడు కనపడటం లేదు, న్యూస్ పేపర్లో ప్రకటన, హై కోర్టు, దెబ్బకు!మాజీ ప్రధాని మనుమడు కనపడటం లేదు, న్యూస్ పేపర్లో ప్రకటన, హై కోర్టు, దెబ్బకు!

రిటైడ్ ఏఎస్ఐ

రిటైడ్ ఏఎస్ఐ

మూడు నెలల క్రితం శంకరప్ప (59) ఏఎస్ఐగా రిటైడ్ అయ్యారు. శంకరప్ప కొడుకు రఘువీర్ కమ్మార్. రఘువీర్ కమ్మార్ నిత్యం మొబైల్ లో హెచ్ జీ గేమ్స్ ఆడేవాడు. మొబైల్ లో గేమ్స్ ఆడటానికి రఘువీర్ బానిస అయ్యాడు. ఆదివారం అతని మొబైల్ లో కరెన్సీ ఖాళీ అయ్యింది. మొబైల్ రీచార్జ్ చేయించాలని, తాను గేమ్స్ ఆడుకోవాలని రఘువీర్ తండ్రి శంకరప్పకు చెప్పాడు.

మొబైల్ రీచార్జ్ కు డబ్బు

మొబైల్ రీచార్జ్ కు డబ్బు

నిత్యం పనిపాట చెయ్యకుండా మొబైల్ లో గేమ్స్ ఎందుకు ఆడుతావని, బుద్దిగా ఏదైనా పని చేసుకోవాలని తండ్రి శంకరప్ప కొడుకు రఘువీర్ కమ్మార్ కు బుద్దిమాటలు చెప్పాడు. మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి తండ్రి శంకరప్ప డబ్బులు ఇవ్వలేదని కొడుకు రఘువీర్ కమ్మార్ రగిలిపోయాడు.

తండ్రిని ముక్కలుగా నరికాడు

తండ్రిని ముక్కలుగా నరికాడు

ఆదివారం రాత్రి తల్లిని గదిలో పెట్టి తాళం వేసిన రఘువీర్ నిద్రపోతున్న తండ్రి శంకరప్ప తలను కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. తండ్రి శంకరప్ప తల, కాళ్లు, చేతులు, మొండెం ముక్కలు చేశాడు. తరువాత తండ్రి జోబులో ఉన్న డబ్బులు తీసుకుని మొబైల్ రీచార్జ్ చేసుకుని గేమ్స్ ఆడాడు. విషయం గుర్తించిన రఘువీర్ తల్లి గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మొబైల్ గేమ్స్ బానిస

మొబైల్ గేమ్స్ బానిస

మొబైల్ గేమ్స్ కు బానిస అయిన రఘువీర్ అనేక సార్లు తండ్రి శంకరప్పతో గొడవ పడేవాడు. ఇటీవల తండ్రితో గొడవపడి ఇంటి కిటికీల అద్దాలు ద్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వచ్చి రఘువీర్ కు బుద్దిమాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ప్రాణం తీసిన రూ. 200

ప్రాణం తీసిన రూ. 200

మీ తండ్రి పోలీసు శాఖలో మంచి పేరు తెచ్చుకున్నారని, పై అధికారులు ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారని, బుద్దిగా ఏదైనా పని చేసుకోవాలని ఇటీవల పోలీసులు రఘువీర్ కు బుద్దిమాటలు చెప్పారు. అయితే మొబైల్ గేమ్స్ కు బానిస అయిన రఘువీర్ తండ్రి శంకరప్పను కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశాడు. పోలీసులు రఘువీర్ ను అరెస్టు చేశారు.మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి రూ. 200 ఇచ్చి ఉంటే శంకరప్ప బతికేవాడని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

English summary
Karnataka: Belagavi based Raghu Veer killed his father after he denied to give money for mobile recharge for playing PUBG game. Kakati police visited the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X