మోడీతో హీరోయిన్ నవ్వులు, సోనమ్ హ్యాపీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోటోలు దిగేందుకు సినీ తారలు ఉత్సాహపడుతున్నారు. సాధారణంగా సినిమా నటులతో ఫోటోలు దిగాలని చాలామందికి ఉంటుంది. రాజకీయ నాయకులు సైతం అందుకు మినహాయింపు కాదని చెప్పవచ్చు! అలాంటి సినీ తారలు మోడీతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటీవల ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మోడీతో పలువురు బాలీవుడ్ నటులు ఫోటోలు దిగి వారి సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో అప్ లోడ్ చేసి ఆనందిస్తున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్.. మోడీతో సెల్ఫీ దిగి, ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే, ప్రముఖ నటీనటులు శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్, సోనూ నిగమ్లు కూడా మోడీతో ఫోటోలు దిగి ట్విట్టర్లో ఉంచారు.
కాగా, నరేంద్ర మోడీ శనివారం నాడు విలేకరులకు విలేకరులకు దీపావళి విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫోటో గ్రాఫర్ అజయ్ కుమార్ సింగ్ నుండి కెమెరాను తీసుకున్న మోడీ క్లిక్ మనిపించారు. అజయ్ కుమార్ సింగ్ ఫోటోలు తీశాడు. దీంతో అజయ్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇది తనకు అతి పెద్ద దీపావళి కానుక అని, తన ఫొటోను మోడీ చాలా బాగా తీశారని, తాను దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటానని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ
ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నరేంద్ర మోడీ
ప్రముఖ నటీనటులు శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్, సోనూ నిగమ్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఫోటోలు దిగి ట్విట్టర్లో ఉంచారు.
నరేంద్ర మోడీ
ప్రముఖ నటీనటులు శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్, సోనూ నిగమ్లు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఫోటోలు దిగి ట్విట్టర్లో ఉంచారు.
నరేంద్ర మోడీ
శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విలేకరులకు ఇచ్చిన దీపావళి విందులో బీజేపీ ఫోటో గ్రాఫర్ అజయ్ సింగ్తో ప్రధానమంత్రి దృశ్యం.
నరేంద్ర మోడీ
శనివారం నాడు విలేకరులకు ఇచ్చిన దీపావళి విందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఫోటో గ్రాఫర్ అజయ్ సింగ్ నుండి కెమెరా తీసుకొని క్లిక్ మనిపించారు.