ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారా?: 'ప్రీపోల్ సర్వే' క్రెడిట్ ఆమెకేనా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా కోరుకున్న కల ఫలించింది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెను యూపీ ఈస్ట్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం, టార్గెట్ మోడీ-యోగి: ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు
రాయ్బరేలి నుంచి పోటీ చేస్తారా?
ప్రియాంక గాంధీ తన కోసం రాయ్బరేలీలో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా మమేకమైన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా సోనియా ఆరోగ్యం సహకరించడం ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాయ్బరేలీలో నుంచి ప్రియాంక గాంధీ నుంచి బరిలోకి దింపుతారా అనే చర్చ సాగుతోంది. మరోవైపు, రాహుల్ గాంధీ కూడా మధ్యప్రదేశ్ వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడి ఏమైనా చోటు చేసుకుంటుందా అనే చర్చ సాగుతోంది.
అదే సమయంలో కీలక బాధ్యతలు
2014 నుంచి సోనియా గాంధీ రాయ్బరేలీకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆరోగ్య సమస్యల కారణంగా రాలేదు. తాజాగా, రెండు రోజులు తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
యూపీ క్రెడిట్ ప్రియాంక గాంధీ ఖాతాలో పడుతుందా?
2014 ఎన్నికల్లో యూపీలో బీజేపీకి 80 సీట్లకు గాను 70కి పైగా వచ్చాయి. ఇటీవల పలు ప్రీ పోల్ సర్వేల్లో నలభై సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. బీఎస్పీ, అఖిలేష్ పార్టీలు కలిసినందువల్ల అంతకంటే తక్కువ సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి 30 నుంచి 50 సీట్లు మాత్రమే వస్తాయని భావిస్తున్నారు. ఇవే ఫలితాలు వచ్చే ఎన్నికల్లో వస్తే అది ప్రియాంక గాంధీ క్రెడిట్లోకి వెళ్తుందని, కాంగ్రెస్ దానిని విస్తృతంగా ప్రచారం చేసుకుంటందని అంటున్నారు.