ఎస్పీజీకి ధన్యవాదాలు తెలిపిన సోనియా గాంధీ... వారి వల్లే సురక్షితంగా ఉన్నామంటూ లేఖ
గత కొన్ని సంవత్సరాలుగా తమ భద్రత కోసం పాటుపడిన ఎస్పీజీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కృతజ్ఝతలు తెలియజేస్తూ ఆ సంస్థ చీఫ్ అరుణ్ సిన్హాకు లేఖ రాసింది. లేఖలో పలు అంశాలను తెలిపింది. ముఖ్యంగా ఎస్పీజీ అధికారుల అంకితభావం, విచక్షణతో పని చేయడం వల్లే తమ కుటుంబం పూర్తి రక్షణలో ఉందని తెలిపింది.
ఎస్పీజీ వెంట ఉండడం వల్ల గత 28 ఏళ్లుగా మా కుటుంబం బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగామని లేఖలో పేర్కోంది. ఈ నేథ్యంలోనే ఎస్పీజీ ఒక అద్బత దళం అని పేర్కోంది. వారిలో సైనికులకు ఉండాల్సిన దేశభక్తితో పాటు ,అప్పగించిన పనిని కచ్చితంగా నిర్వహించే సామర్ధ్యం ఉందని తెలిపింది. ఇలాంటీ సామర్థ్యంతో కుటుంబాన్ని ఇంత కాలం సంరక్షించినందుకు వారిని ప్రశంసిస్తున్నానని సోనియా లేఖలో పేర్కోన్నారు.
కాగా రెండు రోజుల క్రితమే సోనియా గాంధితోపాటు రాహుల్ , ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తగ్గించి జడ్ ప్లస్ భద్రతను కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా 1991 నుండి రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన పరిణామాలతో వారికి ఎస్పీజీ భద్రతను కొనసాగిస్తున్నారు. అయితే భద్రత వలయాన్ని చేధించి రాహుల్ గాంధీతో పాటు సోనియా, మరియు ప్రియాంక గాంధిలు వ్యవహరించడంతో పాటు పలు భద్రతా కారణాలను సమీక్షించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పై కాంగ్రెస్ వర్గాలు మాత్రం మండిపడుతున్నాయి.