వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: శశికళ దెబ్బ, ఆమె బంధువులు మొత్తం ఇప్పుడు వీవీఐపీలే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని మహాత్మగాంధీ విగ్రహం సమీపంలో గురువారం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జాతీయపతాకాన్ని ఎగరవేస్తున్నారు.

<strong>దెబ్బకు దిగింది: పెప్సీ, కోకాకోలా బ్యాన్: వీటికి భలే గిరాకీ వచ్చేసింది</strong>దెబ్బకు దిగింది: పెప్సీ, కోకాకోలా బ్యాన్: వీటికి భలే గిరాకీ వచ్చేసింది

గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గోన్నడానికి అన్నాడీఎంకే చీఫ్ చిన్నమ్మ శశికళ బంధువర్గానికి వీవీఐపీ పాస్ లు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. శశికళ ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Sources said that TamilNadu govt. yet to give VVIP passes to Sasikala Natarajan's relatives.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తదితర ప్రముఖులకు ఇచ్చే వీవీఐపీ పాస్ లు ఇప్పుడు శశికళ బంధువులకు ఇస్తున్నారని వెలుగు చూడటంతో అన్నాడీఎంకే పార్టీలోని ఓ వర్గం నాయకులు మండిపడుతున్నారు.

పన్నీర్ సెల్వంకు లక్కీచాన్స్ !

సాధారణంగా గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర గవర్నర్ జాతీయపతాకాన్ని ఎగరవేయడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం తమిళనాడుకు ఇన్ చార్జ్ గవర్నర్ గా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావు మహారాష్ట్రకు శాశ్వత గవర్నర్ గా పని చేస్తున్నారు.

<strong>షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన కమల్ హాసన్, పోలీసులే ఇలా, ఛీ !</strong>షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన కమల్ హాసన్, పోలీసులే ఇలా, ఛీ !

ముంబైలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యాసాగర్ రావు జాతీయపతాకాన్ని ఎగరవేయనున్నారు. అయితే ఊహించని రీతిలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో జాతీయపతాకాన్ని ఎగరవేసే అవకాశం దక్కింది.

English summary
Republic day: Sources said that TamilNadu govt. yet to give VVIP passes to AIADMK General Secretary Sasikala's relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X