యోగి ఆదేశాలపై యాగి..! ఉదయం 9 గంటలకే ఆఫీసుకు రావాలంటే ఎలా అంటూ ఉద్యోగుల ప్రశ్న!!
యూపి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ అధికారులకు విధించిన నిబంధనలపై వ్యతిరేకత వ్వక్తం అవుతుంది..ఇటివల కలెక్టర్లతో పాటు పోలీసులు కూడ ఉదయం 9 గంటల కల్లా తమ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..దీంతో తోమ్మిది గంటల నిబంధనపై పోలీసు అధికారుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మిగతా ఉద్యోగుల్లాగా పోలీసులను కూడ ఉదయం తోమ్మిది గంటలకే ఆఫీసులకు రావాలనడంతో టార్చర్ అనుభవిస్తున్నట్టు ఓ జిల్లా ఎస్పి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..దీంతో ఎస్పిని ప్రభుత్వం అర్థంతరంగా బదీలీ చేసింది.
యోగి తీసుకువచ్చిన 9 గంటల నిబంధన కలకలం..
యూపిలో యోగి ఆధిత్యానాథ్ జిల్లా కలెక్టర్లతోపాటు ఎస్పీల పనివేళల్లో తీసుకువచ్చిన నిబంధన పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పోలీసులు కూడ ఉదయం 9 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే ఈ నిబంధన తమను టార్చర్కు గురి చేస్తుందని కాస్గంజ్ ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు...ఉద్యోగులకు ఆ నిబంధన అమలు చేయడం సమంజమే అయినా...24 గంటల పాటు ఉద్యోగం చేసే పోలీసు అధికారులకు సైతం ఈ నిబంధన విధించడం సరైన పద్దతి కాదని తెలిపారు..
పోలీసులకు నిబంధన ఏంటని ఆవేదన...
ఎదైన ప్రమాదం , సంఘటన జరిగినప్పడు పోలీసు అధికారులు అర్ధరాత్రి వరకు విధుల్లో ఉంటారని ..తాము ఇంటికి వెళ్లే సరికే అర్థరాత్రి దాటుతుందని అశోక్ కుమార్ చెప్పారు..ఇలాంటీ సంధర్భంలో తమని 9 గంటలకే కార్యాలయాలకు రావాలని పేర్కోవడం తో ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని ఆయన అఅన్నారు....అయితే జిల్లా స్థాయి ఎస్పి ఇలాంటీ వ్యాఖ్యలు చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఎస్పి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే ఆయన్ను మొరాదాబాద్లోని 9వ బెటాలియన్కు పంపించారు.
మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించింది..ఎస్పి
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేదని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైన దాన్ని అమలు చేయాల్సిన భాద్యత ఉద్యోగులకు ఉంటుందని తెలిపిన ఎస్పి తమ ఇబ్బందులను తెలియ చేసేందుకే ఆ వ్యాఖ్యలు చేసినట్టు రాష్ట్ర డీజీపీకి వివరణ ఇచ్చినట్టు తెలిపారు.అయితే మీడీయా తన వ్యాఖ్యలను వక్రికరీంచిందని అన్నారు.కాగా ప్రభుత్వ నిబంధన పోలీసులకు సడలించాలని పలువులు పోలీసు అధికారులు కూడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.