బీజేపీలో ట్రాప్లో పడ్డ ఎమ్మెల్యేలకు గుణపాఠం : సిద్ద రామయ్యా
కర్ణాటకలో రాజీనామ చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేయడం దేశంలోని బీజేపీ ట్రాప్లో పడ్డ వారికి గుణపాఠం అవుతుందని కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ద రామయ్యా అన్నారు. కాగా స్పికర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.కాగా ఆదివారం మధ్యహ్నాం స్పీకర్ రమేశ్ కుమార్ ఓకేసారి 14 మంది ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించాడు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, స్పికర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్పారని సిద్దరామయ్యా అన్నారు. కాగా దేశంలోని బీజేపీ ట్రాప్లో పడిన ఎమ్మెల్యేలకు గట్టి సంకేతాలను పంపించాడని అన్నారు.కాగా అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటుకు సంబంధించి నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాటి గురించి అడిగిన మిడీయాకు పై విధంగా స్పందించారు. మరోవైపు వేటు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తనను సంప్రదించారని అయితే నేను వారితో మాట్లాడేందుకు నిరాకరించానని చెప్పారు.
ఆదివారం ఒకేసారి స్పికర్ రమేశ్ కుమార్ 14 మందిపై వేటు వేయడంతో అనర్హత వేటు పడిన వారి సంఖ్య మొత్తం 17కు చేరింది. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఈ సంఖ్య 207కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 105 కాగా.. బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులు.. స్వతంత్రులు ఇద్దరు కలిపి ఆ పార్టీ బలం 107కి చేరింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ బలం 99కి పడిపోయింది.