లెక్కించాల్సిందే: అవిశ్వాసం ఇచ్చిన పార్టీలకు స్పీకర్ ట్విస్ట్, మళ్లీ నోటీస్ ఇస్తామని ఖర్గే
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన పార్టీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం భేటీ అయ్యారు. సభలో సభ్యుల సంఖ్య లెక్కించకుండా అవిశ్వాసం నోటీసు పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, ఆర్ఎస్పీ, సీపీఎం సభ్యులతో మాట్లాడారు.
Recommended Video
ఈ సందర్భంగా స్పీకర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఆర్ఎస్పీ, సీపీఎం కలిస్తే ఎక్కువ మంది సభ్యులే ఉంటారని అందరూ భావించారు. కానీ పార్లమెంటు నిబంధనల ప్రకారం సభ్యులను లెక్కించాల్సిందేనని చెప్పారు.
అంతకుముందు కాంగ్రెస్ లోకసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చకు వస్తే అన్ని సమస్యలతో పాటు అన్నాడీఎంకే సభ్యులు పట్టుబడుతున్న కావేరీ బోర్డు అంశం కూడా చర్చించవచ్చునని చెప్పారు. తాము కూడా కావేరీ బోర్డుపై నిలదీస్తామన్నారు. రేపు మరోసారి అవిశ్వాసం ఇస్తామన్నారు. మరోవైపు వైసీపీ మరోసారి అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది.