మరో ట్విస్ట్: సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానా ఔట్
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ డైరెక్టర్గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్గా ఉన్న రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆస్థానాపై కేసు నమోదు కాగా, అలోక్ పైన అతను ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెలవులపై పంపించింది.
ఆ తర్వాత తనను సెలవులపై పంపించడంపై అలోక్ వర్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఒక రోజులోనే ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆయనను తొలగించింది.
దీంతో అలోక్ వర్మ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానాను బదలీ చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేశారు. తనపై అవినీతి కేసు నమోదు చేయగా, దానిపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లారు. కానీ ఆయనకు ఊరట దక్కలేదు.