వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్: టీచర్ల శిక్షణకు ప్రత్యేక పాఠశాలలు, బీటెక్ విద్యార్థులకు ఫెలోషిప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 18 అర్కిటెక్చర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.విద్యా రంగంపై ఈ ఏడాది కేంద్రీకరించనున్నట్టు జైట్లీ ప్రకటించారు.ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి ప్రకటించారు

కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై కేంద్రీకరించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రస్తావించారు. బావి భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక స్కూళ్ళను ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ ప్రకటించారు.

special schools to teachers for training: Arun jaitley

డిజిటల్ విద్యా విధానానికి మరింత చేయూత ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. విద్యారంగంలో మౌళికాభివృద్దికి రూ. లక్ష కోట్లతో రైజ్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు.

ఈ ఏడాది నుండి బీటెక్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వెయ్యి మంది విద్యార్థులకు ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ అందించనున్నట్టు జైట్లీ తెలిపారు.

నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. గ్రూప్ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు చేసినట్టు జైట్లీ స్పష్టం చేశారు.

English summary
Union finance minister announced that special schools to teachers for training .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X