బొనాంజా సేల్: రూ.444కే స్పైస్జెట్ విమాన టికెట్!
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ 'మాన్సూన్ బొనాంజా సేల్' పేరుతో బడ్జెట్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది.
ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 మాత్రమేనని తెలిపింది. జమ్మూ- శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రడూన్, ఢిల్లీ-అమృత్సర్ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444 మాత్రమేనని పేర్కొంది.
అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్ 26 వరకు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
దీని కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్ 30లోపు ప్రయాణాలు చేయవచ్చు. స్పైస్జెట్.కామ్తోపాటు ఇతర ట్రావెల్ పోర్టళ్లు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని పేర్కొంది.