కాక్పిట్లో ఎయిర్హోస్టెస్తో పైలట్ లాక్
హైదరాబాద్: బ్యాంగ్కాక్కు చెందిన విమానంలో పైలట్ ఎయిర్హోస్టెస్ను వేధించినందుకు పైలట్ను స్పైస్జెట్ సంస్థ తొలగించింది. ఎయిర్ హోస్టెస్ను కాక్పిట్లో ఉంచుకుని పైలట్ లాక్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తన సీటుపై కూర్చోవాలని ఆమెను అతను అడిగినట్లు తెలుస్తోంది.
పైలట్ చర్యను భద్రత నిబంధనలను, రక్షణ నిబంధనలను ఉల్లంఘించడమేనని సంస్థ భావించింది. కోల్కతా - బ్యాంగ్కాక్ మధ్య నడిచే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. తన చర్య ద్వారా ప్రయాణికుల భద్రతను పైలట్ గాలికి వదిలేసినట్లు సంస్థ అభియోగం మోపింది.
ఎయిర్ హోస్టెస్తో పైలట్ అసభ్యంగా మాట్లాడడంతో సంఘటన వెలుగు చూసింది. తిరుగు ప్రయాణంలో కూడా కాక్ పిట్లోనే ఉండాలని పైలట్ ఎయిర్ హోస్టెస్ను ఆదేశించినట్లు సమాచారం. వాష్రూంకు వెళ్లిన కో పైలట్ను చాలా సేపటి తర్వాత లోనికి అనుమతించినట్లు తెలుస్తోంది.
సంబంధిత అధికారులకు ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేసింది. పౌరవిమాన యాన డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) దృష్టికి కూడా ఈ విషయాన్ని ఆమె తెచ్చింది. డిడిసిఎ చీఫ్ ఎం. సత్యవతి స్వయంగా సంఘటనపై విచారణ చేస్తున్నారు. పైలట్ దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అన్ని పక్షాలకు చెందిన వాంగ్మూలాలను రికార్డు చేశామని, ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారిని తొలగించామని, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని స్పైస్జెట్ కార్పోరేట్ కమ్యూనికేషన్ జిఎం అజయ్ జస్రా చెప్పారు.