శోభనం రాత్రి.. భార్యకు షాక్.. తండ్రి, స్నేహితుడితోనూ గడపమన్న భర్త!
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే శోభనం రోజు రాత్రి తన తండ్రి, స్నేహితుడితో శృంగారంలో పాల్గొనమని చెప్పడంతో ఆ కొత్త పెళ్లికూతురు షాక్ తింది. ఈ ఉదంతం గుజరాత్ రాష్ట్రంలోని నరోద పట్టణంలో వెలుగుచూసింది.
అహ్మదాబాద్ : అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే శోభనం రోజు రాత్రి తన తండ్రి, స్నేహితుడితో శృంగారంలో పాల్గొనమని చెప్పడంతో ఆ కొత్త పెళ్లికూతురు షాక్ తింది. ఈ ఉదంతం గుజరాత్ రాష్ట్రంలోని నరోద పట్టణంలో వెలుగుచూసింది.
నరోద పట్టణానికి చెందిన ఓ యువతి(25) ముంబై నగరానికి చెందిన యువకుడు(27)ని పెళ్లాడింది. శోభనం రోజు రాత్రి.. ఎన్నో కలలతో గదిలోకి అడుగు పెట్టిన ఆ యువతికి భర్త మాటలు శరాఘాతంలా తాకాయి.
తన వల్ల సంతానం కలగదని, కానీ వంశాన్ని నిలబెట్టుకునేందుకు సంతానం అవసరం కాబట్టి తన తండ్రి, స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని స్వయంగా భర్తే చెప్పడంతో ఆ భార్య షాక్ కు గురైంది.
కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. మర్నాడు ఉదయం.. ఎవరైనా మంచి డాక్టర్ ని కలిసి సంతాన సాఫల్య చికిత్స తీసుకోమంటూ ఆమె భర్తకు సూచించింది. కానీ ఆమె భర్త అందుకు ఒప్పుకోలేదు.
దీంతో కొంతకాలం ఈ విషయాన్ని ఆమె కూడా రహస్యంగానే ఉంచింది. తన పుట్టింటి వారికి చెప్పుకోలేదు. కానీ సాక్షాత్తూ మామ, భర్త స్నేహితుడే లైంగికంగా వేధిస్తుండటంతో విసిగిపోయి చివరికి తన పుట్టింటికి చేరుకుంది. భర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. అంతేకాదు, ఆమె భర్త అసలు సంసారానికి పనికి వస్తాడా? లేదా? అనే అంశాన్ని ధ్రువీకరించుకునేందుకు అవసరమైన వైద్యపరీక్షకు పంపించారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులైన మామ, భర్త స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.