కలకలం రేపిన రోడ్డుపై రూ. 500 నోట్లు: కరోనా వ్యాప్తి కోసమేనా? ఏం జరిగింది?
లక్నో: సాధారణంగా రోడ్డుపై రూ. 500 పడితే ఏం చేస్తారు. అటూ ఇటూ చూసి జేబులో వేసుకుంటారు. లేదంటే ఆ డబ్బు ఎవరిదోనని ఆరా తీసి వారికి చెందేలా చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. రోడ్డుపై రూ. 500 నోట్లు పడివున్నప్పటికీ ఎవరూ ముట్టుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రూ. 500 నోట్లను చూసి భయపడిపోయారు..
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్ మిల్ కాలనీలోని రహదారిపై గురువారం రాత్రి రెండు రూ. 500 నోట్లు కనిపించాయి. అయితే, అటువైపు వెళ్లేవారు మాత్రం ఆ డబ్బులను ముట్టుకునేందుకు కూడా భయపడిపోయారు. వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు.
అటు పోలీసులకు.. ఇటు వైద్యులకు సమాచారం..
అంతేగాక, కరోనావైరస్ వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో ఆ నోట్ల వైపు వెళ్లలేదు. ఇంకేవరినీ కూడా అటువైపు వెళ్లనీయలేదు. అంతటితో ఆగకుండా పోలీసు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి ఈ నోట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. స్థానికంగా ఉన్న డాక్టర్లను కూడా సంప్రదించారు. దీంతో సదరు వైద్యులు 24 గంటలపాటు ఆ నోట్లను ముట్టుకోకూడదని సూచించారు. ఇక స్థానిక ప్రజలు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
సోషల్ మీడియాలో వీడియోనే కారణం కావొచ్చు...
ఈ విషయంపై మీడియా ప్రతినిధులు స్థానిక ప్రజలను ప్రశ్నించగా.. కరోనావైరస్ వ్యాప్తి చేయడం కోసమే ఎవరో ఆ నోట్లను ఇక్కడ పడేశారని చెప్పుకొచ్చారు. కరెన్సీ నోట్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
Recommended Video
మహారాష్ట్రలో ఓ వ్యక్తి అరెస్టు..
మహారాష్ట్రలో
ఓ
వ్యక్తి
కరెన్సీ
నోట్లకు
ముక్కులోని
శ్లేష్మం
అంటిస్తూ
ఓ
వీడియో
తీసి
సోషల్
మీడియాలో
పెట్టిన
విషయం
తెలిసిందే.
సోషల్
మీడియాలో
వైరల్
కావడంతో
పోలీసులు
స్పందించారు.
సదరు
వ్యక్తి
కేసు
నమోదు
చేసి
అరెస్ట్
చేశారు.
ఇలాంటి
చర్యలు
సహించబోమని,
కఠిన
చర్యలు
తీసుకుంటామని
హెచ్చరించారు.