Sri Ram Airport: అయోధ్య ఎయిర్ పోర్టు పేరు మార్పు, మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్ పోర్టు, డిసైడ్ !
లక్నో/ అయోధ్య/ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఎయిర్ పోర్టు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఓ తీర్మాణం చేసి ఎయిర్ పోర్టు పేరు మార్చడానికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విమానయాన శాఖకు లేఖ పంపించింది. ఇప్పటికే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు మొదలు కావడంతో మరో అడుగు ముందుకు వేసిన ఉత్తరప్రదేశ్ లోని యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం ఏకంగా ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చెయ్యాలని సిద్దం అయ్యింది. .
Fake Aadhar, facebook:కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, బాధితుల్లో IPSలు, టార్గెట్, సిమ్ కార్డుల దందా!
యోగీ అదిత్యనాథ్ సర్కార్
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి శ్రీరాముడి వీర భక్తుడైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ ఒక ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని ఆలోచించారని తెలిసింది. ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చెయ్యాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ డిసైడ్ అయ్యారు.
మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలోని ఎయిర్ పోర్టుకు శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ విమానాశ్రయం పేరు పెట్టాలని యోగీ అదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్యలోని ఎయిర్ పోర్టు పేరు మార్చి ఆ ఎయిర్ పోర్టుకు మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్ పోర్టు పేరు నామకరణం చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్రం డిసైడ్ చెయ్యాలి
అయోధ్యలోని ఎయిర్ పోర్టుకు మరో నామకరణం చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు శ్రీరాముడి పేరును ఎయిర్ పోర్టుకు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం అమోదించిన ఈ తీర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విమానయాన శాఖకు పంపించి వారి అనుమతి కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేచిచూస్తోంది.
అయోధ్య రామమందిరం.... శ్రీరామ్ ఎయిర్ పోర్టు
కొన్ని దశాబ్దాలకు కోర్టులో నలుగుతూ వచ్చిన అయోధ్య రామమందిరం వివాదం సమిసిపోయింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు అయోధ్యలోని ఎయిర్ పోర్టు పేరు మార్చి ఆ ఎయిర్ పోర్టుకు మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్ పోర్టు అని నామకరణం చెయ్యడానికి ఉత్దరప్రదేశ్ లోని యోగీ అదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.