శ్రీదేవిది హత్యే, ఆమెకు మద్యం తాగించారు: సుబ్రమణ్యస్వామి సంచలనం
Recommended Video
న్యూఢిల్లీ: బాలీవుడు నటి శ్రీదేవిని హత్య చేశారని బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవితో ఎవరు బలవంతంగా మద్యం తాగించారో చెప్పాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు
సుబ్రమణ్యస్వామి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా సుబ్రమణ్యస్వామి శ్రీదేవి మృతిపై సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవి మరణానికి ముందు ఆ గదికి ఎవరెవరు వెళ్ళారనే విషయాన్ని బయటపెట్టాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.
శ్రీదేవి శరీరంలోకి మద్యం ఎలా వచ్చిందని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. హోటల్ రూమ్లో సీసీటీవి పుటేజీని ఎందుకు ఇవ్వలేదని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.
శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదని సుబ్రమణ్యస్వామి చెప్పారు. సినిమా తారలతో దావూద్ ఇబ్రహీంకు ఉన్న సంబంధాలపై ఆరా తీయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. శ్రీదేవి మరణించడానికి ముందు ఆమె గదిలోకి ఎవరెవరు వెళ్ళారనే విషయాన్ని బయటపెట్టాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.
సీసీ టీవి పుటేజీ ఎందుకు ఇవ్వలేదని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. బలవంతంగా మద్యం తాగించారా అనే కోణంలో విచారణ చేయించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు శ్రీదేవిని హత్య చేశారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. మరో వైపు సినీ తారలకు దావూద్ ఇబ్రహీంతో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
బాత్ టబ్లో పడితే చనిపోవడం పట్ల సుబ్రమణ్యస్వామి అనుమానం వ్యక్తం చేశారు.ఎవరైనా బాత్టబ్లో తోసి ఊపిరి ఆడకుండా చేస్తే మరణిస్తారని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు.