ప్రచారంలో అపశృతి: దర్బాంగలో కూలిన స్టేజీ.. మరో చోట కూడా..
బీహర్ రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొనే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అయితే ఆడపా దడపా చెదురు మదురు ఘటనలు జరుగుతోన్నాయి. నిన్న ప్రచారంలో భాగంగా రెండుచోట్ల స్టేజీలు కూలిపోయాయి. అయితే నేతలు/ శ్రేణులకు ఎలాంటి గాయాలు కాలేదు.
దర్బాంగ జిల్లాలో గల జేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అమ్మద్ ఉస్మాన్ స్టేజీ మీద ఉన్నారు. అయితే శ్రేణలు కూడా ఎక్కువ మంది వచ్చారు. దీంతో స్టేజీ మీద ఒత్తిడి పెరిగి కూలిపోయింది. మరోచోట చంపారన్ జిల్లా బాగహి దియోరాజ్ వద్ద కూడా ర్యాలీ తీశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ కూడా కుప్పకూలింది. దీంతో అఖిలేశ్ సింగ్, ఇమ్రాన్ ప్రతాప్ గఢ్ అనే నేతలు పడిపోయారు. అయితే ఇక్కడ కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Recommended Video
బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం కూటమి.. ఆర్జేడీ, బీజేపీ ఇతర పక్షాలు కలిసి పోటీనిస్తున్నాయి. ఎల్జేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ నెల 28వ తేదీన తొలి విడత 71 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 3వ తేదీన రెండో విడత పోలింగ్.. 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది.