ఢిల్లీలో ఇక డీజిల్ కార్లు రిజిస్టేషన్లకు నో
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొత్త డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ కు అనుమతించొద్దని నేషల్ గ్రీన్ ట్రిబునల్ (ఎన్ జీటీ) సూచించింది. ఢిల్లీలోని అన్ని ఆర్ టీఓ కార్యాలయాలలో అన్ని రకాల డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రతిపాదించింది.
అంతే కాకుండా తమ ఉగ్యోగుల కోసం డీజిల్ కార్లు కొనొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాలుష్యాన్ని అదుపు చెయ్యడానికి తాము ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని, అందరూ పాటించాలని సూచించారు.
కాలుష్యాన్ని అదుపు చెయ్యడానికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తెస్తున్న సరి-భేసి పాలసీపై ఎన్ జీటీ పలు ప్రశ్నలు సంధించింది. ఈ విధానంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమనే అనుమానాలను వ్యక్తం చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం అమలు చెయ్యాలనుకుంటున్న సరి-భేసి పాలసీ ఒక్కోక్కరు రెండేసి కార్లు కోనేందుకు పురికొల్పేలా ఉందని ఎన్ జీటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో డీజిల్ కార్లలో సంచరిస్తున్న వారు అయోమయంలో పడిపోయారు.