ఆ ఎద్దు పేడలో ‘బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!
చండీగఢ్: ఓ ఎద్దు పేడ కోసం ఓ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆ ఎద్దు ఎప్పుడు పేడ వేసినా.. వెంటనే తట్టలో ఎత్తి అందులో ఏమైనా ఉందా? అని వెతుకుతోంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ ఎద్దు ఆ కుటుంబానికి చెందిన ఒకరి బంగారు నగలు మింగిన నేపథ్యంలోనే వారు ఇలా చేస్తుండటం గమనార్హం. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
కూరగాయల బుట్టలో నగలు..
వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లా కలన్వాలీలో నివసిస్తున్న వ్యాపారి జనక్ రాజ్ భార్య, కోడలు శనివారం రాత్రి ఓ పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత తమ ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు నగలను తీసి.. కూరగాయల వ్యర్థాలు పడేసే బుట్టలో పెట్టారు. ఆ విషయం మరిచిపోయి మరుసటి ఉదయం కూరగాయలతోపాటు నగలను కూడా బయటపడేశారు.
గుర్తుకొచ్చి వెతికితే...
కాసేపటికి తర్వాత బంగారు నగల విషయం గుర్తుకు వచ్చి అంతటా వెతికారు. చివరకు చెత్తబుట్టలో వేశామని గుర్తుకు రావడంతో ఆ చెత్త ఎక్కడ వేశారో అక్కడ వెతకడం ప్రారంభించారు. అప్పటిక ఓ ఎద్దు ఆ కూరగాయలను తినేసి వెళ్లిపోయింది. అయితే, గుమ్మం వద్ద ఒక చెవిపోగు మాత్రం లభించింది.
సీసీ కెమెరాల్లో కనిపించిన ఎద్దు..
తమ
ఇంటి
వద్ద
ఉన్న
సీసీ
కెమెరా
ఫుటేజీ
చూసి..
వారు
పాడేసిన
కూరగాయలను
ఓ
ఎద్దు
తిన్నట్లు
గుర్తించారు.
ఈ
క్రమంలో
ఆ
ఎద్దును
స్థానికంగా
వెతికి
నేరుగా
ఇంటికి
తీసుకొచ్చి
ఇంట్లోనే
కట్టేశారు.
ఆ
ఎద్దుకు
బాగా
గడ్డి,
చెరుకు
పిప్పి
పెట్టారు.
తమ
బంగారు
నగలు
పేడలో
ఏమైనా
వస్తాయేమోనని
ఇలా
చేశారు.
ఆ
ఎద్దు
పేడ
వేసిన
ప్రతిసారీ
ఓ
తట్టలో
ఎత్తి
వెతికారు.
పేడలో బంగారం కోసం పాట్లు...
ఇలా ఆ కుటుంబసభ్యులు చాలా సార్లు చేసినప్పటికీ ఆ ఎద్దు పేడలో మాత్రం వారి బంగారు నగలు దొరకలేదు. మూడు రోజులు గడిచినా బంగారు నగలు రాకపోవడంతో.. చివరకు పశువుల వైద్యులను కూడా సంప్రదించారు. అయితే, ఆ ఎద్దు ఒక వేళ బంగారు నగలను కూరగాయలతోపాటు తిన్నప్పటికీ వెంటనే బయటకి రాకపోవచ్చని.. సమయం పట్టవచ్చని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఆ కుటుంబసభ్యులు తమ నగల కోసం ఎదరుచూపులు చూడాల్సిన సమయం మరింత పెరిగినట్లయింది.