వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తజకిస్థాన్లో భూకంపం: ఉత్తరాదిలో కంపించిన భూమి
న్యూఢిల్లీ: తజకిస్థాన్లో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు పట్టణాలు సైతం కంపించాయి.
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప ప్రభావంతో శ్రీనగర్, చండీగఢ్ ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
తజకిస్థాన్లోని కారాబూల్ పట్టణానికి 111 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యుఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
Strong 7.2 magnitude earthquake hit Tajikistan on Monday with tremors being felt in North India. Tremors were also felt in Punjab and Uttar Pradesh.
Story first published: Monday, December 7, 2015, 14:16 [IST]