పోటెత్తుతున్న పోర్బందర్: మహాత్ముడు పుట్టిన గడ్డ అతలాకుతలం!
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ గుజరాత్పై పెను ప్రభావాన్ని చూపుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.
రాజన్న బడిబాట కానుక:గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సులు..ఉచిత రవాణా?
గురువారం ఉదయం వాయు తుఫాన్ గుజరాత్లోని పోర్బందర్, మహువా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాయు తుఫాన్ ప్రభావానికి ఒక్క గుజరాత్ మాత్రమే కాదు.. మహారాష్ట్ర సైతం గజగజమంటోంది. తీర ప్రాంత నగరం ముంబై చివురుటాకులా వణికిపోతోంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
తీరం అల్లకల్లోలం..
వాయు తుఫాన్ ప్రభావం గుజరాత్ తీర ప్రాంత పట్టణం పోర్బందర్పై తీవ్రంగా ఉంది. పోర్బందర్ సమీపంలో సముద్రం సుమారు 30 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకుని వచ్చింది. తీర ప్రాంతాలను ముంచెత్తింది. సుమారు ఆరు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడుతున్నాయి. వాయు తుఫాన్ సృష్టించబోతున్న బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను గుజరాత్కు తరలించింది.
వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తీర ప్రాంతాల్లో మోహరింపజేసింది. తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులు తమ ఇళ్లను కూడా ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్తున్నారు.
తీరాని తాకిన క్షణాన..
వాయు తుఫాన్ పోర్బందర్-మహువా మధ్య గురువారం ఉదయం తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 155 నుంచి 170 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని తెలిపారు. తుఫాన్ తాకిడి తీవ్రంగా ఉండే ప్రాంతాల మీదుగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. విమాన సర్వీసులను నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు.
విరావల్ ఓఖా, పోర్బందర్, భావ్నగర్, భుజ్, గాంధీధామ్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే మెయిల్, ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేశామని అన్నారు. ఆయా స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఓ ప్రత్యేక రైలును నడిపిస్తామని చెప్పారు. దీనితోపాటు- అహ్మదాబాద్ నుంచి డయ్యూ, పోర్బందర్, కాండ్లా, భావ్నగర్లకు విమానాల రాకపోకలను రద్దు చేశారు.
#WATCH Gujarat: Strong winds and dust hit the Somnath temple in Gir Somnath district ahead of the landfall of #CycloneVayu, expected tomorrow. pic.twitter.com/CgVFYJvpeH
— ANI (@ANI) June 12, 2019
#WATCH Gujarat: High tides and strong winds at the Chowpatty beach in Porbandar ahead of the landfall of #CycloneVayu, expected tomorrow. pic.twitter.com/NZkMNSTs7k
— ANI (@ANI) June 12, 2019