కాలేజ్ గేటు ముందే కారులో విద్యార్థి కిడ్నాప్, టార్చర్ !
బెంగళూరు: కాలేజ్ వార్షికోత్సవానికి వెళ్లిని విద్యార్థిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బెంగళూరు నగరంంలో జరిగింది. భాదితుడు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బెంగళూరు నగరంలోని లక్ష్మణనగరలో నివాసం ఉంటున్న యువకుడు ప్రైవేటు కాలేజ్ లో పీయూసీ (ఇంటర్) చదువుతున్నాడు. ఇంటి సమీపంలోని కాలేజ్ లో జరుగుతున్న వార్షికోత్సవానికి ఆ యువకుడు వెళ్లాడు. ఆ సందర్బంలో సాటి కాలేజ్ యువకులకు, అతనికి చిన్న విషయంలో గొడవ జరిగింది.
గొడవ జరిగిన రెండు రోజుల తరువాత కాలేజ్ ముగించుకుని కాలేజ్ బయటకు వచ్చిన విద్యార్థి గేటు ముందు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో కారులో వచ్చిన సాటి విద్యార్థులు యువకుడిని కిడ్నాప్ చేశారు. తరువాత నిర్జనప్రదేశంలోకి తీసుకువెళ్లి తన మీద దాడి చేశారని, లైంగికంగా వేధింపులకు గురి చేశారని భాదితుడు రాజగోపాలనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొంత మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.