వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో డేటింగ్‌కు వెళితే.. గ్యాంగ్ రేప్.. నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి..

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో యువతి దారుణంగా లైంగిక దాడికి గురైంది. 12 తరగతి చదువుతున్న యువతిపై ఇద్దరు ఉన్మాదులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో బీహెచ్‌ఈఎల్ సెక్యూరిటీ గార్డుతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణం భోపాల్‌లోని గోవింద్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం..

ఏకాంత ప్రదేశంలో బాయ్‌ఫ్రెండ్‌తో

ఏకాంత ప్రదేశంలో బాయ్‌ఫ్రెండ్‌తో

బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి మారుమూల ప్రాంతానికి డేటింగ్‌కు వెళ్లింది. వారిద్దరు ఏకాంతంగా మాట్లాడుకొంటుండగా నిందితులు ఇద్దరు వారిని కర్రలతో దాడి చేశారు. ఇద్దరు ప్రేమికులను వివస్త్రలుగా చేసి ఫోటోలు తీయడంతోపాటు వీడియోను కూడా చిత్రీకరించారు. వారిని తమ చేష్టలతో వేధించారు. చివరకు బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు.

నగ్నంగా ఫోటోలు.. వీడియో తీసి

నగ్నంగా ఫోటోలు.. వీడియో తీసి

ఇక ప్రియుడితో బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. రూ.5 వేలు డిమాండ్ చేసి.. ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేస్తామని, కుటుంబ సభ్యులకు కూడా పంపిస్తామని బెదిరించారు. దాంతో తన ప్రియురాలిని అక్కడే వదిలి 5 వేలు తెచ్చేందుకు స్కూటర్‌పై సంఘటనాస్థలం నుంచి వెళ్లి తిరిగి రాగా, యువతి భోరున విలపిస్తూ కనిపించింది అని పోలీసులు తెలిపారు.

ఒంటరిగా ఉన్న యువతిపై

ఒంటరిగా ఉన్న యువతిపై

ఏడుస్తున్న తన ప్రియురాలిని ఓదార్చుతూ విషయం అడుగగా.. ఇద్దరు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ప్రియుడికి యువతి తెలిపింది. దాంతో షాక్ తిన్న ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తటపటాయించాడు. ఆ తర్వాత ధైర్యం కూడగట్టుకొని తనకు 5వేలు ఇచ్చిన స్నేహితుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు..జుడిషియల్ కస్టడికి అప్పగింత

కేసు నమోదు..జుడిషియల్ కస్టడికి అప్పగింత

ప్రియుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితులను జుడిషియల్ కస్టడికి అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిలో ఒకరు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే రాంబాబు సూర్యవంశీ (35)గా, మరో వ్యక్తి స్థానికుడు రాకేష్ రాజ్‌పుత్ (45)గా గుర్తించారు. సూర్యవంశీకి ముగ్గురు సంతానం.. రాజ్‌పుత్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై అత్యాచారం కేసుతోపాటు కిడ్నాప్, దోపిడి కేసును కూడా నమోదు చేసినట్టు భోపాల్ ఐజీ మీడియాకు తెలిపారు.

English summary
12th class student gang raped in Bhopal. Before the tragedy, She went on dating with her friend. Accused attacked them with sticks, forced them to pose nude and took their pictures and a video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X