లాగి, గదిలో నిర్బంధించి అమ్మాయిపై విద్యార్థుల గ్యాంగ్ రేప్
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు కిరాతకంగా వ్యవహరించారు. బడి మానేసిన 14 అమ్మాయిని లాక్కుని వెళ్లి గదిలో నిర్బంధించి ముగ్గురు పన్నెండో తరగతి విద్యార్థులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటన పవిత్ర ఉజ్జయిని నగరంలోని మహకాల్ ప్రాంతంలో జరిగింది.
ఆ సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు మహకాల్ పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ముగ్గురు టీనేజ్ యువకులను పోలీసులు ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నారు. దేవాస్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రంగ్బావడి ప్రాంతంలో అద్దె గదిలో ఉంటున్నారు. శుక్రవారంనాడు దేవాస్ జిల్లా నుంచి వాళ్ల మిత్రుడు వచ్చాడు.
అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతుల కూతురైన 14 ఏళ్ల అమ్మాయిని ఆ ముగ్గురు తమ గదిలోకి పిలిచారు. అయితే ఆమె నిరాకరించింది. అయితే, ఆమెను టాయిలెట్లోంచి లాక్కుని తమ గదికి తీసుకుని వెళ్లారు. కూలీ పనిచేసుకుని అమ్మాయి తల్లిదండ్రులు ఆ సమయంలో పనికి వెళ్లారు.
18 ఏళ్ల విజేంద్ర రాజ్పూత్తో పాటు ఇద్దరు పన్నెండో తరగతి విద్యార్థులు, వారి 17 ఏళ్ల మిత్రుడు అమ్మాయిపై అత్యాచారం చేశారు. దేవాస్ జిల్లా నుంచి వచ్చిన 17 ఏళ్ల మిత్రుడు బయట కాపలా ఉన్నాడు. ఆ విషయాన్ని అమ్మాయి తాను మెహిందీ తయారీ నేర్పే ప్రైవేట్ టీచర్కు చెప్పింది. ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.