15 రోజుల్లో ఆధార్ డీ లింక్ ప్లాన్ ఇవ్వండి: టెలికాం సంస్థలకు ఉడాయ్
న్యూఢిల్లీ: ఆధార్ను డీ లింక్ చేసే ప్లాన్ను పదిహేను రోజుల్లోగా ఇవ్వాలని భారత ఉడాయ్... టెలికాం సంస్థలను కోరింది. ఆధార్ను టెలికాం వినియోగదారుల గుర్తింపు కోసం ఉపయోగించడం నిలిపేయాలని తెలిపింది. మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు చెప్పింది.
టెలికాం సంస్థలు సహా ప్రయివేటు కంపెనీలు ఆధార్ నంబర్ అడగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఉడాయ్ భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తదితర టెలికాం సేవల కంపెనీలకు సర్య్కులర్ను పంపింది. టెలికాం సంస్థలు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థలను నిలిపివేసే, ఆధార్ను డీ లింక్ చేసే ప్రణాళికలను అక్టోబరు 15లోగా ప్రణాళిక అందించాలని అడిగింది.
వ్యక్తుల ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్స్ ఉన్న ఆధార్ సమాచారాన్ని ప్రయివేటు కంపెనీలు డిమాండ్ చేయడానికి వీల్లేదని భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అయితే ఆధార్ రాజ్యాంగ బద్ధమేనని కోర్టు స్పష్టంచేసింది.