వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసులను అదుపు చేయండి, రాజ్ నాథ్ సింగ్ కు సుబ్రమణ్యస్వామి ఫోన్, కారణమదేనా?
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి ఫోన్ చేశారు తమిళనాడులో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై సుబ్రమణ్యస్వామి చర్చించారు.
చెన్నై:తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి ఫోన్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలపై సుబ్రమణ్యస్వామి చర్చించారు.
గోల్డెన్ బే రిసార్ట్ నుండి ఎంఏల్ఏలను ఖాళీ చేయించకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని స్వామి విన్నవించారు. తమిళనాడు పోలీసులను నియంత్రించాలని ఆయన ఫోన్ ద్వారా కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కోరారు.
ఎంఏల్ఏ శరవణన్ ఫిర్యాదు మేరకు పోలీసుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీలను అన్నాడిఎంకె ఎంఏల్ఏలు అడ్డుకొన్నారు. ఈ సమయంలో ఎంఏల్ఏలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకొంది. ఈ సోదాల్లో నలుగురు ఎస్ పి లు, మూడు వేల మంది పోలీసులు పాల్గొన్నారు. అయితే రిసార్ట్ నుండి ఖాళీ చేయాలని ఎంఏల్ఏలను పోలీసులను కోరారు.
Comments
panneerselvam tamil nadu chief minister jayalalithaa sasikala vk sasikala subramanya swamy rajnath singh జయలలిత శశికళ పన్నీర్ సెల్వం
English summary
subramanya swamy phoned to union home minister.he demanded to union home minister to control Tamil nadu police.
Story first published: Wednesday, February 15, 2017, 16:42 [IST]