సామాన్యుడి ఇంటికి ఊహించని అతిథి.. విజయ్కాంత్ ఇంత సింపుల్గా!
మిట్ట మధ్యాహ్నాం పూట కడుపులో ఆకలి దంచేయడంతో.. మార్గమధ్యలో విశాలమైన ఓ పెంకుటిల్లు ఎదుట కారు ఆపారు.
చెన్నై: ఆలయ దర్శనం కోసమని సతీమణితో కలిసి బయలుదేరిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్.. అనుకోని అతిథిలా ఓ సామాన్యుడి ఇంట దర్శనమిచ్చారు. తొలుత ఎవరో అనామక వ్యక్తి అని కసురుకున్న సదరు ఇంటి యజమాని.. ఎదురుగా ఉన్నది విజయ్ కాంతే అని తెలుసుకున్నాక.. అతని ఆనందానికి అవదుల్లేవు.
ఇంతకీ అసలు సంగతేంటంటే.. సతీమణి ప్రేమలతతో కలిసి డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ఈరోడ్ జిల్లాలోని సెన్నిమలై మీదుగా ఓ ఆలయానికి వెళ్లారు. అయితే మిట్ట మధ్యాహ్నాం పూట కడుపులో ఆకలి దంచేయడంతో.. మార్గమధ్యలో విశాలమైన ఓ పెంకుటిల్లు ఎదుట కారు ఆపారు.

ఎండవేడి ఎక్కువగా ఉండటంతో తలకు ఎర్ర తువాలును పాగాలా చుట్టుకున్నారు విజయ్ కాంత్. అనంతరం వెంట తెచ్చుకున్న భోజనాన్ని అక్కడే అరిటాకులో పెట్టుకుని ఇద్దరు ఆరగించడం మొదలుపెట్టారు. ఇంతలో పొలం నుంచి వచ్చిన సదరు ఇంటి యజమాని.. ఎవరో అనామకులు అంటూ ఛీదరించుకున్నాడు.
అయితే దగ్గరికొచ్చి చూస్తే.. ఎదుట ఉన్నది విజయ్ కాంత్ కావడంతో సదరు యజమాని చాలా సంబరపడిపోయాడు. అంతేకాదు, కొన్ని స్వీట్లను, వంటకాలను తెచ్చి దంపతులిద్దరికీ పెట్టాడట. దీంతో ఆ దంపతులిద్దరు సదరు యజమాని పెట్టిన వంటకాలను కూడా ఆరగించారట.
ఇక విజయ్ కాంత్ దంపతులు గ్రామంలోనే ఉన్నారని తెలియగానే జనమంతా అటువైపు పోటెత్తారు. దీంతో ఆ యజమానికి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి మెరుపువేగంతో వెళ్లిపోయారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications