సునంద పుష్కర్ హత్య: ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసుతో సంబంధమున్న ఆరుగురికి ప్రత్యేక విచారణ బృందం(సిట్) పాలీగ్రాఫ్ పరీక్షలు(లై డిటెక్టర్) నిర్వహించింది.
ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ మాట్లాడుతూ.. సునంద కేసులో విచారణ కొనసాగుతోందని చెప్పారు. అవసరమైన వారందరికీ పాలీగ్రాఫ్ టెస్టులు చేసినట్లు తెలిపారు. వాటి నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు.
భవిష్యత్తులో అవసరమనుకంటే మరికొంత మందినీ ఈ పరీక్షల ద్వారా విచారిస్తామని ఎస్పీ బస్సీ తెలిపారు.
2010లో శశిథరూర్తో సునంద పుష్కర్కు వివాహమైంది. కాగా, 2014, జనవరి 17న న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని లీలా హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంతకుముందు పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్.. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే ఆరోపణలతో సునంద పుష్కర్ ఆమెపై విమర్శలు చేసింది.