24గంటల్లో థరూర్ను మళ్లీ, ఆ ఆరేళ్లలో కోట్లు సంపాదించిన సునంద!
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ను శుక్రవారం నాడు మరోసారి ప్రశ్నించారు. ఇరవై నాలుగు గంటల్లోనే థరూర్ను రెండోసారి ప్రశ్నించారు. గురువారం నాడు థరూర్ను పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఓసారి ప్రశ్నించారు.
డీసీపీ పీఎస్ కుష్వంత్, సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సింగ్ల ఆధ్వర్యంలో థరూర్ను ప్రశ్నించారు. మొదటిసారి ప్రశ్నించినప్పుడు చెప్పిన వాటిని, సాక్షుల నుండి సేకరించిన వాటి ఆధారంగా ఇరవై ప్రశ్నలు తయారు చేసుకొని గురువారం నాడు ప్రశ్నించారు. శుక్రవారం మరోసారి ప్రశ్నించారు. కాగా, ఐపీఎల్ తదితర అంశాల పైనా ప్రశ్నించారు.
దుబాయ్లో సునంద పుష్కర్ ఆరేళ్లలో...
సునంద పుష్కర్ 90లలో దుబాయ్లో ఆరేళ్ల పాటు ఉన్నారు. ఆమె తన తొలి భర్త సుజిత్తో కలిసి ఉన్నారు. ఆమె ఆమె తన తెలివితేటలతో కోట్లాది రూపాయలు సంపాదించారని సమాచారం.
సమాచారం మేరకు... సునంద మృతి చెందే సమయానికి ఆమెకు దుబాయ్లో 12 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి విలువ రూ.93 కోట్లుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆమె 2004 నుండి 2010 వరకు దుబాయ్లో ఉన్న సమయంలో సంపాదించారు. అదే సంవత్సరం ఆమె శశిథరూర్ను వివాహం చేసుకున్నారు.