వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24గంటల్లో థరూర్‌ను మళ్లీ, ఆ ఆరేళ్లలో కోట్లు సంపాదించిన సునంద!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌ను శుక్రవారం నాడు మరోసారి ప్రశ్నించారు. ఇరవై నాలుగు గంటల్లోనే థరూర్‌ను రెండోసారి ప్రశ్నించారు. గురువారం నాడు థరూర్‌ను పోలీసులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఓసారి ప్రశ్నించారు.

డీసీపీ పీఎస్ కుష్వంత్, సీనియర్ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర సింగ్‌ల ఆధ్వర్యంలో థరూర్‌ను ప్రశ్నించారు. మొదటిసారి ప్రశ్నించినప్పుడు చెప్పిన వాటిని, సాక్షుల నుండి సేకరించిన వాటి ఆధారంగా ఇరవై ప్రశ్నలు తయారు చేసుకొని గురువారం నాడు ప్రశ్నించారు. శుక్రవారం మరోసారి ప్రశ్నించారు. కాగా, ఐపీఎల్ తదితర అంశాల పైనా ప్రశ్నించారు.

Sunanda Pushkar murder: Tharoor quizzed on IPL angle

దుబాయ్‌లో సునంద పుష్కర్ ఆరేళ్లలో...

సునంద పుష్కర్ 90లలో దుబాయ్‌లో ఆరేళ్ల పాటు ఉన్నారు. ఆమె తన తొలి భర్త సుజిత్‌తో కలిసి ఉన్నారు. ఆమె ఆమె తన తెలివితేటలతో కోట్లాది రూపాయలు సంపాదించారని సమాచారం.

సమాచారం మేరకు... సునంద మృతి చెందే సమయానికి ఆమెకు దుబాయ్‌లో 12 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి విలువ రూ.93 కోట్లుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆమె 2004 నుండి 2010 వరకు దుబాయ్‌లో ఉన్న సమయంలో సంపాదించారు. అదే సంవత్సరం ఆమె శశిథరూర్‌ను వివాహం చేసుకున్నారు.

English summary
Former Union minister Shashi Tharoor on Thursday morning joined police investigations in connection with the mysterious death of his wife Sunanda Pushkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X