సన్నీ లియోన్ సన్నీ నైట్ షో బ్యాన్, హైకోర్టులో పిల్, అనుమతి ఇవ్వాలని !
Recommended Video
బెంగళూరు: నూతన సంవత్సరం సందర్బంగా బెంగళూరు నగరంలోని మాన్యతా టెక్ పార్క్ లో బాలీవుడ్ నటి, నీలి చిత్రాల మాజీ నటి సన్నీ లియోన్ తో ఏర్పాటు చేసిన సన్నీ నైట్ షోకు అనుమతి ఇవ్వాలని ఆ కార్యక్రమం నిర్వహకులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
సన్నీ లియోన్ గతంలో నీలి చిత్రాల్లో నటించిందని ఒక్క కారణంతో అభ్యంతరం వ్యక్తం చెయ్యడం సరికాదని సన్నీ నైట్స్ కార్యక్రమం నిర్వహకులు అంటున్నారు. నూతన సంవత్సరం సందర్బంగా బెంగళూరు నగరంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వాటిలో సన్నీ నైట్స్ కార్యక్రమం ఒకటి. సన్నీ నైట్ షో నిర్వహణకు అనుమతి ఇవ్వారాదని కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేశాయి. అయితే శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని బెంగళూరు పోలీసులు సన్నీ నైట్స్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు.
పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహించడానికి ఎక్కవ సమయం పోడిగించిన పోలీసులు మా కార్యక్రమాన్ని అడ్డుకోవడం అన్యాయం అంటూ సన్నీ నైట్స్ నిర్వహకులు అంటున్నారు. మొత్తం మీద డిసెంబర్ 31వ తేదీ సమీపిస్తున్న సమయంలో సన్నీ నైట్ కార్యక్రమం నిర్వహకులు కోర్టును ఆశ్రయించారు.