ఇండియాకు బదులు భారత్: పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, మంత్రిత్వశాఖకు అందజేయాలని సూచన..
ఇండియా బదులు భారత్ లేదా హిందుస్తాన్ మార్చాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశాన్ని ఇండియా, భారత్, హిందుస్తాన్ అని పిలుస్తుంటాం. కానీ ఇండియా అని ఎక్కువమంది పిలవడం వల్ల ఢిల్లీకి చెందిన ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన ధర్మాసనం.. పేరు మార్పు పిటిషన్ను కొట్టివేసింది.
ఆర్టికల్ 1కు సవరణ చేయాలని పిటిషనర్ కోరారు. 1 ఆర్టికల్ గురించి 1948 రాజ్యాంగం ముసాయిదాపై చర్చ జరిగిందని పిటిషనర్ కోరారు. అందుకోసమే భారత్, లేదంటే హిందుస్తాన్ అని పేరు పరిశీలించాలని కోరారు. కానీ పిటిషనర్ వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది.
Recommended Video
పేరు మార్పునకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం కన్నా.. మార్పునకు సంబంధించి పిటిషన్ కాపీని మంత్రిత్వశాఖకు ఇవ్వాలని సూచించింది. దానిని ఆ శాఖ పరిశీలించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర మంత్రివర్గం పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఛేంజ్ చేసే వీలుంటుందని అభిప్రాయపడింది. సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది.